CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫ్రెంట్ లైన్ వారియర్స్ కి కరోనా టీకా..

Share it:

 


టీకా పై అపోహలు నమ్మొద్దు అంటున్న వైద్యాధికారి డాక్టర్ వీరబాబు...


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారి డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్  అయినా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, సిబ్బందికి, కోవిడ్ వ్యాక్సినేషన్ మలివిడత కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్ పి శ్రీకాంత్, పోలీస్ శాఖ సిబ్బంది టీకా తీసుకున్నారు, అనంతరం స్థానిక తాహశీల్దార్ లూధర్ విల్సన్ సమక్షంలో రెవెన్యూ శాఖ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ.. టీకా పై వస్తున్న వదంతులను, దుష్ప్రచారాలను, నమ్మొద్దు అన్నారు. ఈ టీకా తీసుకోవడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మొదటి విడతలో రెండు వందల ఇరవై మందికి గాను గర్భిణీలు, బాలింతలు, మినహా 215 మందికి ఈ టీకాను ఇచ్చామన్నారు. వారందరూ పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నారని తెలిపారు. ఈ టీకా తీసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరు తప్పకుండా కరోనా నియమ నిబంధనలు పాటించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: