మన్యం టీవీ పినపాక: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం లో భాగంగా జానంపేట గ్రామపంచాయతీ లో టిఆర్ఎస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి పట్టభద్రులను కలుసుకుని, తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన పథకాల గురించి, భవిష్యత్తులో చేయబోతున్న పథకాల గురించి, త్వరలో ప్రకటించబోతున్న ఉద్యోగాల వివరాలు గురించి తెలియజేస్తూ పట్టభద్రులను తమ యొక్క అమూల్యమైన ఓటును పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం వేయాలని, తమ ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య , సొసైటీ చైర్మన్ రవి వర్మ , ఎంపీటీసీ హరీష్ , స్థానిక నాయకులు బుల్లి బాబు , బెడద శ్రీను , గాండ్ల అశోక్ , పోలిశెట్టి శ్రీను , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: