ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ 2017 లో అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జైల్లో ఉన్నారు. జనవరి 27 వ తేదీన ఆమె విడుదలైనప్పటికి నెలాఖరు వరకు హాస్పిటల్లో ఉన్నారు. ఇటీవలే ఆమె బెంగళూరులోని ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే, శశికళ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం అక్రమాస్తుల కేసు రుజువైతే ఆరేళ్ళపాటు పోటీ చేసేందుకు వీలులేదు. అయితే, ఈసీ అనుమతులు ఇస్తే పోటీ చెయ్యొచ్చు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై శశికళ దృష్టి పెట్టారు. నిన్నటి రోజున టీవీవీ దినకరన్ తో ఆమె చర్చలు జరిపారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు రెండాకులు సొంతం చేసుకునే దిశగా ఆమె పావులు కదుపుతున్నారు.
Post A Comment: