మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం ఎస్ వి కే ఎమ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు పాఠాలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు నేడు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వ గైడ్లైన్స్ పాటిస్తూ ప్రతి విద్యార్థి మాస్కు తప్పనిసరిగా ధరించి రావాలని ప్రధానోపాధ్యాయులు కోరారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను బడికి పంపించాలని కోరారు. శానిటేషన్ తో పాటు భౌతిక దూరం పాటిస్తూ పాఠ్యాంశాలను బోధి స్తామని ప్రధానోపాధ్యాయులు దుర్గా ప్రసాద్ మన్యం టీవీకి తెలిపారు.
Post A Comment: