మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,జూలూరుపాడు మండలం లోని కాకర్ల గ్రామం లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎస్ఐ పి శ్రీకాంత్ ప్రారంభించారు. బ్యాటింగ్, బౌలింగ్, చేసి యువత, క్రీడాకారుల్లో, ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువకులు క్రీడాకారులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలు నిర్వహించడం వలన యువత చెడు వ్యసనాలకు దూరమై స్నేహ భావ వాతావరణం ఏర్పడి, శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యవంతులై ఆనందంగా ఉంటారని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు ఎస్ ఐ శ్రీకాంత్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొన్నెకంటి వీరభద్రం, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చీమల పాటి బిక్షం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: