CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించుకోకపోతే కేంద్రానికి విద్యుత్ కార్మికుల నిరసనలు తప్పవు:బిటిపిఎస్ జే.ఏ.సి

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఇంజనీర్ల ఉద్యోగుల ఐక్యవేదిక బిటిపిఎస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020-21 బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జనరేటింగ్ స్టేషన్లలో వర్క్ బై కాట్ విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని బిటిపిఎస్ లో నిర్వహించారు.బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నుండి వందలాదిగా ఉద్యోగులు బిటిపిఎస్ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టం 2020-21 బిల్లును రద్దు చేయాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు కొరకు రూపొందించిన బిడ్డింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలని, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలలో విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయొద్దని,అన్ని రాష్ట్రాల జనరేటింగ్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని, విద్యుత్ సంస్థల ప్రైవేట్ లైసెన్స్లు రద్దు చేసి ఫ్రాంచైజీ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు, ప్లే కార్డులు ప్రదర్శించారు. అనంతరం బిటిపిఎస్ సీఈ బాలరాజు కు వినతి పత్రం ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇంజనీర్ నాయకులు చందు, నరేష్, నాయకులు హేమ్ల, సత్యనారాయణ,నాయకులు వి.ప్రసాద్,మనోహర్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దెల,హుస్సేన్,నాయకులు ప్రేమ్,శంషుద్దీన్,టిఆర్వికేఎస్ నాయకులు ప్రకాష్,మధు, ఎస్టీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ సురేష్, నాయకులు మోహన్,చరణ్, శివ సత్యనారాయణ,రఫీ, విజయ రామ్,వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: