ఉట్నూర్ మన్యం టివి ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతపూర్ లోగోండి ధర్మగురు జంగో లింగో దీక్ష పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాని మాట్లాడుతూ వచ్చే జనగణ లో గోండి ధర్మం అని తమ మత కోడ్ ను తెలియపర్చాలి అని పేర్కొన్నారు. జంగో లింగో దీక్ష ముక్యంగా మహిళలు వేస్తే ఇల్లు సమాజానికి మేలు జరుగుతుందని సూచించారు. జంగో లింగో దీక్ష వేస్తే ఎలాంటి కష్టం వచ్చిన జంగో లింగో కాపాడుతారు అని సూచించారు. ఇతరమతాల దీక్ష వేయకుండా తమ గోండి ధర్మ దీక్షను చేపట్టి జాతి అభివృద్ధికి తోడ్పాలి అని పేర్కొన్నారు. నేడు అనేక దీక్షలు వేస్తున్నారు కానీ అవి సరియైనవి కావు ఎందుకంటే తన తండ్రిని విడిచి వేరే వారిని తండ్రి అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో పెంధోర్ అర్జున్ ఏటీఫ్ జిల్లా అధ్యక్షులు, పుర్క బపురావు తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, పెందోర్ ప్రభాకర్ న్యాయవాది,మా డవి రాజేష్, అడా షేకు,కోటనక పాండురంగ్,మంగం విషంరావు, అడా శంభు యోశోధ గ్రామ పటేల్ వివిధ గ్రామాల దీక్షధారులు పాల్గొన్నారు
Post A Comment: