మన్యం టీవీ, ఇల్లేందు:
ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన భూ నిర్వాసితులకు డగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భూ నిర్వసితుల సంఘం ఆధ్వర్యంలో ఉసిరికాయలపల్లి గ్రామం నుండి ఇల్లందు జి. యం ఆఫీస్ వరకు 13 కి.మీ లు పాదయాత్ర చేసి అనంతరం జి యం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు,భూ నిర్వసితుల సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇల్లందు లో మొదట బొగ్గు వెలికి తీసినప్పుడు భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వలేదని వారికి ఉపాధి చూపలేదని అన్నారు.ఉద్యోగాలు ఇవ్వాలని కోర్ట్ అదేశిహించిన గాని సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు.సింగరేణి యాజమాన్యం కొలువుల జాతర అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిందని ముందు నిర్వసితుల గురించి యాజమాన్యం మాట్లాడాలని అన్నారు.ఉద్యోగాలు ఇవ్వక పోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించరు.
ఈ కార్యక్రమంలో నిర్వాసితులు సమ్మయ్య,రమేష్, బన్సీలాల్,సైదులు,మల్లయ్య,రవి,రాందాస్ లతో పాటు ఎంపీటీసీ జ్యోతి,సర్పంచ్ బన్సీ లు పాల్గొనగా సీపీఎం, టీ ఏ జీ ఎస్,కెవిపిఎస్ సంఘాలు సంఘీభావం తెలిపాయి.
Post A Comment: