మన్యం టీవీ మంగపేట.
పాఠశాలలు పున ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని కమలాపురం బిల్ట్ కాలనీలోని థాపర్ విద్యా విహార్ స్కూల్ లోని 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు ,టీచర్స్ కు, స్కూల్ స్టాప్ కు శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేసిన టీ యూ డబ్ల్యూ జె టెంజు ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పలపల్లి రమేష్ , టీ యూ డబ్ల్యూ జె ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లూరి మాధవ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగపేట తహసిల్దార్ బాబ్జి ప్రసాద్ స్టూడెంట్స్ కు టీచర్ టు మా స్కూల్ పంపిణీ చేసి కరోనా పై అవగాహన కల్పించారు. ఉన్న కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదువుకొని ఉత్తమ శ్రేణిలో పాసై పాఠశాలకు, తల్లిదండ్రులకు ,గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. శానిటైజర్స్ మరియు మాస్కులు అందించిన జర్నలిస్టులు ఇప్పలపల్లి రమేష్ ,నల్లూరి మాధవ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కామేశ్వరరావు,థాపర్ విద్యా విహార్ స్కూల్ టీచర్స్ సర్వేశం, ఫజిల్, ఇతర టీచర్స్ ,స్కూల్ స్టాప్, స్టూడెంట్స్ పాల్గొన్నారు .
Post A Comment: