మన్యం టీవీ,అశ్వాపురం :సీనియర్ తాపీ మేస్త్రి బడేటి లింగయ్య ను ఘనంగా సన్మానించారు. సోమవారం ఉదయం యూనియన్ కార్యాలయం లో గత 40సంవత్సరాలనుండి అశ్వాపురం లో తాపీ మేస్త్రి గా విశేష సేవలనందించి వందల మంది యూవత కు మార్గ దర్శకులుగా నిలిచి మండలం లో నిర్మాణ రంగం లో యూనియన్ నిర్మాణం లో క్రియ శీలకంగా పని చేసిన లింగయ్య ను ఏఐటీయూసీ కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ ,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేలపురి సురేందర్ రెడ్డి, కార్యదర్శి చిలక విశ్వనాధం, నాయకులు ముద్దు శెట్టి నర్సింహా రావు, దావా వెంకటేశ్వర్లు, మోత్కురి బాబురావు, బిట్రా ఆనంద్, వెంకటనర్సయ్య ,పదిర చందు, భద్రం, దావా రమేష్ ,ఇనపల్లి పవన్ సాయి, నాగార్జునాచారీ, ఖలీల్, తెల్లం బాలకృష్ణ, గద్దె శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: