మన్యం టీవీ కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు నేతాజీ గ్రౌండ్లో సిరి వాలెంటరీ బ్లడ్ బ్యాంక్ అండ్ రామవరం బ్లడ్ ట్రస్ట్ కప్ వారు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఎట్టకేలకు ఫైనల్కు చేరుకుంది దీనిలో భాగంగా ఆరో వార్డు లో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులు లెవెన్ జట్టు 5 టీములతో ఆడి ఫైనల్ మ్యాచ్ కి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సీతాలక్ష్మి టీం లెవెన్ జట్టును అభినందించి క్రీడాకారులకు టీ షర్ట్లు బహూకరించి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి ఆరో వార్డు కు కప్పు తీసుకురావాలని ప్రోత్సహించి ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ టీం లెవెన్ జట్టు సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: