_మన్యం టీవీ భద్రాచలం_: covid 19 తో అన్నదాన సత్రం లో నిలిపివేసిన అన్నదాన వితరణను సోమవారం నుంచి తిరిగి కొనసాగిస్తున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. Covid 19 కారణంతో గత కొద్దికాలంగా అన్నప్రసాద ప్యాకెట్లు అందిస్తున్నామని ప్రస్తుత covid 19 నిబంధనలను ప్రభుత్వం సడలించిన నేపథ్యంలో అన్నదాన సత్రం లో తిరిగి బఫె పద్ధతిలో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు covid 19 నియమ నిబంధనలను పాటిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Post A Comment: