ఢిల్లీ, మన్యం టివి :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో 2021-22 ఆర్థిక బడ్జెన్ ను ప్రవేశపెడుతున్నారు. కరోనా తర్వాత దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంది.
బడ్జెట్ హైలైట్స్:
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 20 వేల కోట్లు
రాష్ట్రాలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల మూలధన వ్యయం కోసం రూ. 2 లక్షల కోట్లు
విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ వ్యవస్థలు
డిస్కమ్ లకు రూ. 3,05,984 కోట్ల సాయం
హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నాం
ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ. 1,624 కోట్లు
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
బీమా రంగంలో ఎఫ్డీఐల శాతం 49 నుంచి 74 శాతానికి పెంపు
త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు అదనంగా రూ. 20 వేల కోట్ల సాయం
2022 నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు
ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ రవాణా కారిడార్ ఏర్పాటు
రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ. 1,01,055 కోట్లు
2023 నాటికి రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి
దేశ వ్యాప్తంగా విశాఖ సహా ఐదు చోట్ల ఆధునిక ఫిషింగ్ హార్బర్లు
చెన్నై, విశాఖల్లో మేజర్ హార్బర్లు
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం
మంది ఆర్థిక వవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు. ఇక నుంచి బ్యాంకుల ఎన్పీఏలను నిర్వహించనున్న బ్యాడ్ బ్యాంక్.
వ్యవసాయ రంగానికి రూ. 75,100 కోట్లు
వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.50 లక్షల కోట్లు
రూ. 40 వేల కోట్లతో గ్రామీణ మౌలిక వసతులు
వన్ నేషన్-వన్ రేషన్ తో 69 కోట్ల మందికి లబ్ధి
మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు
దేశ వ్యాప్తంగా 15 వేల ఆదర్శ పాఠశాలలు, 100 సైనిక్ స్కూళ్లు.
Post A Comment: