అయిదు లీటర్ల శానిటైజర్, వంద మాస్కులు అందజేసిన వాలాద్రి శ్రీనివాస్
మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి.
దానిలో భాగంగా రాజుపేట జడ్పీహెచ్,ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు కోవిడ్ వ్యాప్తిని విస్తరించకుండా
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీమతి మంజుల మరియు స్టాఫ్ చేతుల మీదుగా
రాజుపేట కి చెందిన
శ్రీ సాయి అపోలో మెడికల్ షాప్ ఓనర్ వాలాద్రి శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులకి యాంటీ వైరస్ కార్డ్స్ మరియు విద్యార్థుల కి ఉపయోగ పడే విధంగా అయిదు లీటర్ల
స్టాండ్ శానిటైజర్ తో పాటు సుమారు వంద మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.
అలాగే ప్రతీ పది రోజులకి ఒకసారి తమ మెడికల్ షాప్ ద్వారా మాస్కులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఈసందర్భంగా యాజమాన్యం శ్రీనివాసరెడ్డి కి పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: