మన్యంటీవీ ఏటూరునాగారం:
జయశంకర్ భుపాలపల్లి గారెపల్లి మండలంలోని ప్రతాపగిరి గుట్టపై ఆదివాసీ నాయకపోడు పూర్వీకుల ఆచార్య సంస్కృతి సంప్రదాయాలు నిర్వహించిన గొంతెమ్మ లక్ష్మీదేవి కృష్ణ స్వామి కళ్యాణ మహోత్సవం జాతరకు ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తల్లులను దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాయకపోడు పూర్వకాలం నుండి నేటి వరకు ఇదే స్థితిలో ఉన్నారు. ఈ జాతరకు పూర్వ వరంగల్ జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు సమర్పించుకున్న కుంటున్నారు. కానీ నీటి వసతి మరియు రోడ్డు సౌకర్యం లేనందున భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గుడి దగ్గరకు వెళ్ళటానికి రోడ్డు సౌకర్యం అలాగే మంచి నీటి వసతి కల్పించాలని కలెక్టర్ కు ఐటీడీఏ పీవో కు విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో కోట నరసింహులు ఎంపీటీసీ నాయకపోడు సేవా సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు, సర్పంచ్ గుంటి లక్ష్మి, ఎంపీటీసీలు రమేష్ ,రవీందర్ రావు,ఐటీడీఏ ఎఫ్ఆర్ ఓ పెనక ప్రభాకర్, పూజారి పిట్టల సమ్మయ్య, ఆదివాసీ నాయకులు గుంటి రమేష్, ఇనుముల సంతోష్, కుడిమీత సమ్మయ్య, చింతల సుధాకర్, కోట అశోక్ జాతర కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: