CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సొసైటీ భూమి సాగుదరులైన గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని ధర్న

Share it:

 


  మన్యం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం(ఇల్లందు) ఇల్లందు మండలం ఒడ్డుగూడెం గ్రామపంచాయతీ చెన్నంగులగడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులకి 1971 లో ఇచ్చిన సొసైటీ భూములకు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని,రైతుబందు పథకాని వర్తింపచేయలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీ ఏ జీ ఎస్) ఆధ్వర్యంలో ఇల్లందు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

  ఈ సందర్భంగా టీఏజీఎస్ జిల్లా సహాయకార్యదర్శి వజ్జ సురేష్ మాట్లాడుతూ చెన్నంగులగడ్డ గడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులకు 1971 లో సొసైటీ భూములను ఉమ్మడి పట్టా క్రింద ఇవ్వడం జరిగిందని ఆనాటి నుండి నేటి వరకు స్థానిక ఆదివాసీలు సాగు చేస్తూ వస్తున్నారని అన్నారు.భూమి ఉంది తప్ప వ్యక్తిగత యాజమాన్యం లేకుండా పోయిందని ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు పథకానికి కూడా అర్హత లేకుండా పోయిందని అన్నరూ.అదేవిధంగా భూమి ఉమ్మడి గా ఉండి సాగు చేస్తున్న గిరిజనులు భూమి పైన  హక్కు కల్పించాల్సిన అవరం ఉందని అన్నారు.ఉమ్మడి పట్టాను రద్దు చేసి ప్రస్తుతం భూమి ని సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వ పరంగా వచ్చే రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

   ఈ కార్యక్రమంలో మోహన్ రావు,కల్తీ బిక్షం,పాయం లక్ష్మీనర్సు,పడిగే సైదమ్మ, దనసరి రాంబాబు,పాయం లక్ష్మీ,అలెం రాధ,జోగ కొనమ్మ,కొటెం కిరణ్,పాయం శ్రీరాములు,ఈసం రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: