మన్యంటీవీ ఏటూరునాగారం:
ఈరోజు ఏటూరునాగారం మండలం కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేశ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ హాజరై మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించడానికి తెరాస పార్టీ ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు మండల పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు మహిళా సంఘాలు గ్రాడ్యువేట్స్ సైనికుల పని చేయాలని తెరాస పార్టీ మండల అధ్యక్షులు పిలుపునిచ్చారు. అలాగే ఏటూర్ నాగారంలో ఈనెల 8వ తేదీన రాబోవు ఎమ్మెల్సీ. ఎన్నికల సన్నాహక సమావేశం జరుగ ఉన్నదని ఏటూరునాగారం గ్రామంలోని 16 వార్డు లో ఒక్క వార్డు నుండి .100. మంది చొప్పున 1600 మందిని తరలించాలని దీనినే తెరాస నాయకులు ప్రజా ప్రతినిధులు తగు సన్నాహాలు చేసుకోవాలని అన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీగా. గెలిపించి సీఎం గారికి కానుకగా పంపుతామని తెరాస నాయకులు కార్యకర్తలు దృఢ సంకల్పంతో ఉన్నారని గడదాసు సునీల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కోఆప్షన్ సభ్యురాలు ఎండి వాలీయబీ సలీం, కూనూర్ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సయ్యద్ సర్దార్ పాష, నూతి కృష్ణమూర్తి, పెండ్యాల ప్రభాకర్, ఎండి ఖాజా పాషా, ధనపునేని కిరణ్, కుమ్మరి చంద్రబాబు, వావిలాల రాంబాబు, దొడ్డ కృష్ణ, కొండాయి చిన్ని, సిద్దబోయిన రాంబాబు, సప్పిడి రాంనర్సయ్య, జాడి బోజరావు, కొమ్మెర రమేష్, కందగట్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు రంజిత్, నాగసాగర్, ఎండి అక్బర్, తాళ్లపళ్లి మోహన్, విజయ్, మహిళా నాయకులు సయ్యద్ సఫియా, ఈసం స్వరూప, సత్యమ్మ, కమల, పద్మ, చంద లక్ష్మీనారాయణ, పి మాణిక్యం, చంద్రకళ, రామ్ దుర్గ, కమల, సుమలత రామన్న ఇట్టెం నాగరాజు, ఎగిడి కోటయ్య, కుమారస్వామి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: