.. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ను ఘనంగా సన్మానించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్పాడిల గురువు కనకరాజు కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వగా అవార్డు గ్రహీత కనకరాజు కు హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తన అసెంబ్లీ ఛాంబర్ లో ఘనంగా శాలువాతో సన్మానించి పూల బోకే ను అందజేశారు...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన ఆదివాసి ముద్దుబిడ్డ గుస్పాడిల కళా నృత్యాన్ని గల్లీ నుండి, ఢిల్లీ దాకా, తీసుకెళ్లడంతో పాటు అత్యుత్తమ అవార్డు పద్మశ్రీ రావడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు రాష్ట్రానికి దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. కృషి, పట్టుదల అంకిత భావానికి లభించిన విజయం ఇదన్నారు.
Post A Comment: