CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి

Share it:

 


జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు  డిఎంహెచ్ వో అప్పయ్యతో కలిసి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పోలియో రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని కావున ఐదు సంవత్సరాల పిల్లలకు అందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని పిల్లలు పోలియో బారిన పడకుండా కాపాడాలని జెడ్ పి చైర్మన్ పిలుపునిచ్చారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ములుగు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ములుగు జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, స్థానిక ఎంపిటిసి  గొర్రె సమ్మయ్య, రమేష్ రెడ్డి, తాహెర్ పాషా తదితరులు ఉన్నారు. అలాగే ఈరోజు ఏటూరునాగారం మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్ లో జిల్లా కో ఆప్షన్ మెంబర్ వలీయాబీసలీం మరియు ఏటూరునాగారం ఎంపీపీ అంతటి విజయనాగరాజు తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పుడు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు  వేయడం ద్వారా పోలియో నిర్మూలన అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: