CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ పూజరులకు గౌరవ వేతనం,కళాకారులకు సొసైటీ ద్వారా రుణాలు ఇవ్వాలి

Share it:

 


తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం

మన్యం టీవీ, భద్రాద్రి కొత్తగూడెం(ఇల్లందు):

   ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ పూజరులకు గౌరావ వేతనం 10 వేలు ఇవ్వాలని,డోలీ,నృత్య, పాటల కళాకారులకు సొసైటీ ఏర్పాటు చేసి రుణాలు ఇవ్వాలని,ధూప దీప నైవేద్య పథకాన్ని ఏజెన్సీ లో ఉన్న ఆదివాసీ ప్రధాన ఆలయాలకు వర్తింప చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీ ఏ జీ ఎస్) ఆధ్వర్యంలో ఇల్లందు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

  ఈ సందర్భంగా టీ ఏ జీ ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి వజ్జ సురేష్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగు అవుతున్నంయని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు.ఆదివాసీల వంశపారంపర్యంగా వస్తున్న ఆలయాలను ధూప దీప నైవేద్య పథకంలో చేర్చాలని కోరారు.ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయలు పరిరక్షణకు కృషి చేస్తున్నారని కళారూపాలతో సంప్రదాయలను కాపాడుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని అన్నారు.ట్రైబల్ సబ్ ప్లాన్ నిధుల ద్వారా అభివృద్ధి చేయాలని అన్నారు.పూజరులకు,కళాకారులకు దృవీకరణ పత్రాలు ఇవ్వాలని,ఆదివాసీ పండుగలకు సెలవులు ఇవ్వాలని అన్నారు.

  ఈ కార్యక్రమంలో మోహన్ రావు,కోరం కోటమ్మా,చీమల విరమ్మ,మూతి లక్ష్మీ,కల్తీ కౌసల్య,మూతి రంగమ్మ,కలెత్తు వసంత,ఎరుపోతుల సరోజ,కల్తీ సోమమ్మ,బొల్లి బుచ్చయ్య,చీమల సరోజ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: