మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో
బిటిపిఎస్ భూ నిర్వాసితులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంటెక్ వెల్ కింద భూములు కోల్పోయిన వారికీ ఉద్యోగాలు కల్పించాలని, పసుపు,కుంకుమ కింద వున్న భూములు కోల్పోయిన 25 మంది రైతులకు వెంటనే పరిహారం, లేదా ఉద్యోగం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య డిమాండ్ చేశారు.రైల్వే లైన్ నిర్వాసితులకు ఉద్యోగం, లేదా పరిహారం పై వెంటనే క్లారిటీ ఇవ్వాలని,డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీపీఐ డివిజన్ కార్యదర్శి సారెడ్డి.పుల్లారెడ్డి,సీపీఐ మండల,టౌన్ కార్యదర్శి ఎస్కె.సెర్వర్,దుర్గ్యాల సుధాకర్,జిల్లా సమితి సభ్యులు రావులపల్లి రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: