మన్యంటీవీ ములుగు/ఏటూరునాగారం:
సోమవారం ప్రవేశపెట్టిన అటువంటి బడ్జెట్ ను నిరసిస్తూ ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్ గారి ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహదారిపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ గారు మాట్లాడుతూ కరోనా వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య రంగా పరిశ్రమల మీద ఎంతో భారం పడిన సంగతి అందరికీ తెలిసిందే,పరిశ్రమలు నడవక కోట్ల మంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు,ప్రైవేట్ టీచర్ లు ప్రైవేట్ కంపెనీ కి చెందిన కార్మికుల జీవితాలు నాశనం అయినాయి,ఇలాంటి పరిస్థితుల్లో కరోనా చేసిన నష్టం తర్వాత తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం మూడు రాష్ట్రాల ఎన్నికల కోసం మాత్రమే భారతదేశ ఆర్థిక బడ్జెట్ మొత్తం మళ్ళించింది,విద్యార్థులకు యువతకు నిరుద్యోగులకు మొండి చేయి చూపింది, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం సగం జీతాలతో బ్రతుకుతున్న ప్రజల మీద పెట్రోల్ డీజిల్ రేట్లు భారాన్ని మోపడం బాధాకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షులు నల్లేల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు చంద్ పాషా,నాయకులు మట్టేవాడ తిరుపతి,బద్రు నాయక్,దేవ్ సింగ్,యూత్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,యూత్ నాయకులు రేవంత్ యాదవ్,రాజేందర్ నాయక్,కోగిల రాంబాబు, చందు,నేపాల్ రావు,రాహుల్, గణేష్,అనిల్,భాను ప్రతాప్ సింగ్,శ్రీధర్,గోవర్దన్,కిషోర్, రాజేందర్,నరేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: