మన్యంమీడియా,అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని అన్నపురెడ్డిపల్లి,పెద్దిరెడ్డిగూడెం (ఏర్రగుంట) రైతు వేదిక కేంద్రంలలో ది:08-02-2021 న రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలో అబ్బుగూడెం గ్రామపంచాయతీ రైతులకు,పెద్దిరెడ్డిగూడెం రైతు వేదికలో గుంపెన గ్రామపంచాయతీ రైతులకు, యసంగి పంటలలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు,ఎరువుల వినియోగం, యాజమాన్య పద్ధతులు గురించి మండల వ్యవసాయ అధికారి అనూష వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో వైస్ ఎంపిపి మామిడిపల్లి రామారావు,రైతు బంధు కో ఆర్డినేటర్ కొత్తూరు వెంకటేశ్వరరావు,ఎఈఓ ప్రశాంత్,సంధ్యారాణి,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: