CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి సమస్యలపై పోరాటం

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం  ఐటీడీఏ పరిధిలో గల పిఓ గౌతమ పోట్రు ను కలిసి వినతి పత్రం అంద చేద్దామని ఎంపీ మీడియం బాబురావు మరియు  అన్నవరపు కనకయ్య మరియు తదితర నాయకులు వచ్చారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు వేరే కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని తెలిసింది. ఎంపీ మీడియం బాబురావు మరియు అన్నవరపు కనకయ్య మరియు సిపిఎం రాష్ట్ర అ కార్యదర్శి పిట్టల అర్జున్ రావు మరియు తదితరులు పాల్గొని ఏవో బీమ్ రావు మరియు డి టి శ్రీనివాస్ రావు కు అందజేయడం జరిగింది. ఎంపీ మీడియం బాబురావు మాట్లాడుతూ మీ గ్రామాల్లో కొందరు సర్వే అని చెప్పి డబ్బులు తీసుకోవడం జరుగుతుందని తెలిసింది ఇలా సుమారు పదిహేను లక్షల పైగా తీసుకున్నారని తెలిసింది కావున గిరిజనులు సర్వే అని చెప్పి వచ్చినప్పుడు మీ దగ్గరలో నాయకులు లేదా మీ సర్పంచ్ కి తెలియజేయగలరని చెబుతున్నాను అని ఆయన వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ అధికారులు ఎవరైనా కందకాలు తవ్వడానికి వచ్చినారు గిరిజనుల అందరూ ఏకమై పార్టీలతో సంబంధం లేకుండా మీ భూమి మీ పోడు భూమి పై పోరాడాలని ఆయన అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడాలని ఆ కందకాలు తవ్వి మిషన్  ఊరు నుంచి తరిమి వేసే వరకు అందరూ ఏకం గా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంపీ మీడియం బాబురావు ,అన్నవరపు కనకయ్య, కోటేశ్వరరావు ,ఎస్ కె నబి, సున్నం గంగా ,వీరస్వామి ,పిట్టల అర్జున్, గౌరీ నగేష్ ,మడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: