మన్యం టీవీ మణుగూరు:
జాతీయ స్థాయి విద్య సాంకేతిక కార్యచరణ పరిశోధన చేస్తున్న నాయుడుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వి. కోటేశ్వరరావు,సాంబయి గూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. రవికుమార్ లను మణుగూరు మండలం, రామానుజవరం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు అందరూ ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి.నాగరామ శర్మ మాట్లాడుతూ వీరిద్దరినీ ఆదర్శంగా తీసుకొని మరికొంత మంది ఉపాధ్యాయులు జాతీయస్థాయిలో రాణించాలి అని ఆకాంక్షించారు.బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీలత మాట్లాడుతూ వీరిద్దరూ ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటే ఆదర్శ ఉపాధ్యాయులు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వి. వీరస్వామి,జి.నాగశ్రీ పటేల్, రామిరెడ్డి,నరసింహారావు, సత్యం,సాంబయ్య,నిర్మలా దేవి,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: