పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్...
మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్ సోమవారం పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోన విజృంభించిన నేపథ్యంలో, పాఠశాలలన్నీ మూతపడి..! తిరిగి ఈ రోజు నుండి ప్రారంభమైన సందర్భంలో , జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ను కస్తూరిబా గాంధీ విద్యాలయం, లోని తరగతి గదులను, పరిసరాలను ,వసతులను ,పరిశీలించారు. కరోనా నియమ నిబందనలు, శానిటేషన్ ,మధ్యాహ్న భోజన పథకం, అమలు వంటి పలురకాల అంశాలపై ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు. అనంతరం జూలూరుపాడు లోని నర్సరీని పరిశీలించి మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు, తహశీల్దార్ ఉష శారద, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు, కస్తూరిబా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారి పద్మజ ,ఎన్ఆర్ఈజీఎస్ ఏ పీ ఓ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: