CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిఘా నిద్ర... దొంగల జాతర

Share it:


 మన్యంటీవీ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. పట్టణం నడిబొడ్డున ఇండియన్ డిజిటల్ స్కూల్  ఎదురుగా ఓ కిరాణా షాప్ షట్టర్ పగలగొట్టి లోపలికి చొరబడి ని దొంగలు కౌంటర్లో ఉన్న యాభైవేల రూపాయల నగదు చోరీ చేశారు. అదేవిధంగా బస్టాండ్ ఏరియాలోని  ఓ వైన్ షాప్ లో పడ్డ దొంగలు పది వేలు నగదు దొంగలించారు. పోలీసు పెట్రోలింగ్ ఉన్నప్పటికీ దొంగలు హెచ్చుమీరి పోతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.గత కొన్నాళ్లుగా దొంగలు బీభత్సం సృష్టిస్తున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. వారం క్రితం దుండగలు ఇంట్లో దూరి మహిళను గొంతు కోసి నగలు దొంగిలించిన దుండగులు, మళ్ళీ వెంటనే ఇవాళ దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. పోలీసులు మాత్రం ఏదో నామమాత్రపు విచారణ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: