మన్యంటీవీ దమ్మపేట: ప్రత్యేక రాష్ట్రావతరణ అనంతరం నిరుద్యోగులకు అనేక ఉద్యోగావకాశాలు కల్పించామని... పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో మాజీ ఎంఎల్ఏ తాటి వెంకటేశ్వర్లు అద్వర్యం లో నిర్వహించిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరించామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి, కృష్ణా నీటితో సశ్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు తాత మధు, గ్రామాల నుంచి పట్టభద్రుల ఓటర్లు, పార్టీ మండల,గ్రామ ప్రజాప్రతినిధులు, మండల,డివిజన్, గ్రామ పట్టభద్రుల ఏంఎల్సీ ఎన్నికల కో ఆర్డినేటర్ లు, మండల,సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్ష, కార్యదరస్సులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదరస్సులు, నామినేటెడ్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, ఎల్ఎస్సీఎస్ డైరెక్టర్ లు, పాలకవర్గ సభ్యులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: