CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలు ఉపసహరించుకోవాలి

Share it:

 


👉జానంపేట ప్రధాన రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా

మన్యం టీవీ, పినపాక:కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట ప్రధాన రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద ర్భంగా అఖిలపక్షం నాయకులు బొల్లుజు అయోధ్య చారి  మాట్లాడుతూ... రైతుల నడ్డి విరిచే కాంట్రాక్ట్‌ ఒప్పందం వ్యవసాయ చట్టం, మార్కెట్‌ నిర్వీర్యం చేసి చట్టం, గిట్టుబాటు ధరల్ని ఎత్తేసే చట్టం, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం, విద్యుత్‌ సవరణ చట్టాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతును తన భూమిలో తనను కూలీగా మార్చే విధానం రైతుకు నస్టం అని స్పష్టం చేశారు. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఫసల్‌ బీమా వర్తింప చేసి, ప్రతీ రైతు కుటుంబానికి రూ.7500, 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలన్నారు. పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందించాలని డిమాండ్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు నిమ్మల వెంకన్న,టీడీపీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు ,రైతులు తదితరులు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: