CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూమి పోట్లాట.. హరితహారం ప్లాంటేషన్ పేరుతో పనులు ప్రారంభం..! అడ్డుకున్న ఆదివాసి గిరిజన పోడు సాగు రైతులు...

Share it:

 


మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని, రాజుపాలెం బీటు, జూలూరుపాడు రేంజ్, జూలూరుపాడు సెక్షన్, సూరారం అటవీ ప్రాంతంలోని 108వ కంపార్ట్మెంట్ నెంబర్లో, బుధవారం జూలూరుపాడు డిప్యూటీ రేంజ్ అధికారి ధనలక్ష్మి తన సిబ్బందితో కలిసి హరితహారం ప్లాంటేషన్ కొరకు సరిహద్దు కాలువ పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆదివాసి పోడు సాగు రైతులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. గత రెండు మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న మా భూములను హరితహారం ప్లాంటేషన్, అభివృద్ధి, పేరుతోటి లాక్కోవాలని చూడడం న్యాయం కాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు ఈ భూమిని లాక్కుంటే మేం బ్రతికేది ఎట్లా గాని వాపోయారు. ససేమిరా మేం పనులు ప్రారంభించాల్సిందే నని అటవీ అధికారులు,  పనులు నిలిపివేయాలని పోడు సాగు రైతులు, పట్టుపట్టడంతో సందిగ్ధత ఏర్పడింది. చీకటి పడడంతో అటు పోడు రైతులు, ఇటు అటవీ అధికారులు, చలిమంటలు వేసుకొని అటవీ లోనే ఉండడం గమనార్హం.

Share it:

TELANGANA

Post A Comment: