CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ధర్నా...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్ లో బుధవారం ప్రధాన జాతీయ రహదారిపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యార్థులకు భారీగా అన్యాయం జరిగిందని అన్నారు.  బడ్జెట్ విషయంలో విద్యార్థులకు 10 శాతం ఇవ్వాలని విద్యార్థి సంఘాలు,  మేధావులు ఇతర సంఘాలు, చెప్తున్నప్పటికీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం 2 .67 ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నారు. అంటే కేవలం 93 వేల కోట్లు మాత్రమే  ఇవ్వడం జరుగుతుందని గత ఏడాది 3.27 అంటే 99 కోట్లు విడుదల చెయ్యగా ఈ సంవత్సరం దాదాపు ఏడు కోట్లు రూపాయలు విద్యార్థులకు నష్టం జరుగుతుందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో విద్యార్థుకు అన్యాయం చేసినందున రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేయవలసి వచ్చిందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు జమ్మి యశ్వంత్, వై గగన్, మోదుగు శివ, ఎన్. వంశీ, కె ఆకాశ్, సుమంత్, మని చంద్ర, రాముకార్తీక్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: