మన్యంటీవీ,అశ్వారావుపేట:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ కేంద్ర పరిధిలో. మొన్న రాత్రి రాజ్యాంగ సృష్టికర్త, భారతదేశ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంఘ విద్రోహ శక్తులు చెప్పుల దండలు వేసి అవమానపరిచారు. ఈ సందర్భంగా ఈ రోజు కుల సంఘాల ఆధ్వర్యంలో దుండగులను వెంటనే అరెస్టు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి పునరావతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అశ్వరావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల దండలు వేసి తదుపరి నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల మహానాడు అధ్యక్షుడు జక్కుల రాంబాబు, అల్లాడి వెంకట రామారావు, నక్క రాంబాబు, బీసీ సంఘ అధ్యక్షులు తాళం సూరి, జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి ప్రసాదు, ఏంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నార్లపాటి వెంకటేష్, జిల్లా నాయకులు కోనేటి పకిరయ్య, గేలంకి అశోక్, నార్లపాటి సుబ్బారావు, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ జిల్లా నాయకులు కలపాల శ్రీనివాస్ రావు, అశ్వారావుపేట ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఆసీఫ్, ఎస్కె బాజి, స్వారో మండల అధ్యక్షులు నండ్రు సత్య ప్రసాదు, రమేష్, శ్రీకాంత, సాయి, దళిత సంఘం నాయకురాలు మద్దల దేవి, మండల టీఆర్ఎస్ పార్టీ ఉప అధ్యక్షులు నార్లపాటి సుదర్శన్ మరియు విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: