మన్యంటీవీ ములుగు/ఏటూరునాగారం:
ములుగు రేంజ్ పరిధిలోని జాకారం నర్సరీ సందర్శించి పరిశీలించిన సి సి ఎఫ్ అక్బర్ అనంతరం అయన. మాట్లాడుతూ .విత్తనాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా నీళ్లు చల్లాలని కలుపు మొక్కలను మొదట్లోనే గుర్తించి తొలగించాలని అన్నారు.నర్సరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సిబ్బందికి వివరించారు. ప్రైమరీ బెడ్స్ పెంపకం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.మొక్కల ఎదుగుదల విషయంలో జీవమృతం తగు సమయంలో అందించాలని సిబ్బందికి సూచించారు.20 రకాల సీడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. మొక్కలు పొడవుగా పెరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్సరీలో పెంచే మొక్కల లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలి అన్నారు.ఆయన వెంట ములుగు డీ. ఎఫ్.వో ప్రదీప్ కుమార్ శెట్టి గారు,ములుగు ఎఫ్.డీ. వో నిఖిత గారు,ములుగు రేంజ్ ఆఫీసర్ రాం మోహన్ గారు,సెక్షన్ ఆఫీసర్ రవీందర్, బీట్ ఆఫీసర్ అనిల్ ఉన్నారు.
Post A Comment: