మన్యం టివీ, అశ్వాపురం:
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో లారీ డ్రైవర్ కు మణుగూరు కోర్టు మేజిస్ట్రేట్ ఏడు రోజులు జైల్ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. భద్రాచలం కు చెందిన లారీ డ్రైవర్ ను అశ్వాపురం సీ ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచగా మేజిస్ట్రేట్ ఏడు రోజులు జైల్ శిక్ష విధించారు.
మద్యం సేవించి వాహనాలు నడప వద్దని మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని సీ ఐ సట్ల రాజు సూచించారు.
Post A Comment: