ఆసిఫాబాద్:-పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని,రెండు చుక్కలు చిన్నారులు నిండు జీవితానికి భరోనిస్తుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుఅన్నారు.కుంరం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజలందరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి,పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి వ్యాధి నిర్మూలనలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కుంరం బాలు,ఎంపీపీ మల్లికార్జున్,జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గదవేని మల్లేష్,సహకార సంఘం చైర్మన్ అలిబిన్ హైమద్,మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకన్న,మరియు వైద్యులు,టిఆర్ఎస్ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: