మన్యం టీవీ,అశ్వాపురం :ఇటీవల మృతి చెందిన చింతిర్యాల మాజీ ఉప సర్పంచ్ పెయింటింగ్ కార్మికుడు గుర్రం శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. చింత్రియాల గ్రామానికి చెందిన వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం సాయంత్రం గుర్రం శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపి 10వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ నాయకులు బిట్రా వెంకటేశ్వర్లు, ఆనంద్, కొండ కృష్ణ, నిట్ట యేసుబు, ఎడెల్లి బాబురావు, మోత్కురి ఉదగిరి, రాధ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: