చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామ పంచాయితీ లో కొన్ని రోజులుగా మంచినీళ్ళు రావడం లేదని. అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పిన. ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదురుగా కూర్చుని నిరసన వ్యక్తం చేశారు అనంతరం మహిళలు మాట్లాడుతూ. తిప్పనపల్లి జాతీయ రహదారి వెంబడి సుమారు 20 కుటుంబాలకు నెల రోజులు నుంచి మంచి నీళ్లు రావడం లేదని ఇదే విషయాన్ని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు తప్పితే సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి మంచినీళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని. మేము రోజు కూలి పనులకు వెళుతూ ఉంటామని. ఇంటివద్ద మంచి నీరు లేకపోవడంతో మంచినీళ్ల కోసం కూలి పనులు సైతం వదులుకొని ఇళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని. ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోని మంచినీటి సమస్య తీర్చాలని. లేనిపక్షంలో గ్రామస్తులందరం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తామని తెలిపారు.
ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. కేవలం జాతీయ రహదారి వెంబడి మాత్రమే సమస్య తలెత్తుతుంది ఎక్కడో పైప్లైన్ జామ్ అవ్వటం వల్ల ఇలా నిరంతరం సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా పైప్ లైన్ పూర్తిగా తవ్వించి మరమ్మతులు చేయిస్తాము సమస్యను రెండు రోజుల్లో పరిష్కారం చేసి వారికి పూర్తిస్థాయిలో మంచినీరు వచ్చేలా చేస్తామని దీనికి గ్రామస్తులు కూడా సహకరించాలని కోరారు.
Post A Comment: