చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మండల వ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు తహశీల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో కార్యాలయ సిబ్బంది ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు అలాగే చండ్రుగొండ, బెండాలపాడు, అయ్యన్నపాలెం, ప్రాథమిక పాఠశాలల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం అందరు కలిసి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మల్లిపెద్ది లక్ష్మీ భవానీ, పూసం వెంకటేశ్వర్లు, కార్యదర్శులు కే ఉపెందర్, సతీష్ కుమార్, ఎన్నికల బూత్ లెవెల్ ఆఫీసర్లు, స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: