CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ప్రైవేటు వైద్యులకు నేడు కోవాగ్జిన్,కోవిషీల్డ్

Share it:

 


 👉కరోనా టీకను వేసిన ప్రభుత్వ వైద్యులు,


మన్యం టీవీ కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం నందు ఈరోజు ఉదయం ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులకు,వారి సిబ్బందికి కరోనా టీకా వేయడం జరిగినది,మొదటిగా డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు టీకాను వేయించుకుని ప్రైవేటు వైద్యులకు ధైర్యాన్నిచ్చి ఆదర్శంగా నిలిచారు,ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ నుండి రక్షణ పొందుటకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించి ప్రజలను రక్షించుటకు,కోవాగ్జిన్,కోవిషీల్డ్,  (కరోనా)టీకాను ప్రవేశపెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ముందుగా కేంద్ర ప్రభుత్వానికి, భారత శాస్త్ర వేత్తలకు, అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ టీకా వేయించుకుని కరోనా బారిన పడకుండా తమను తాము రక్షించుకోవాలని,ఎలాంటి అపోహలకు,దుష్ప్రచారాలకు, గురికాకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఈ యొక్క టీకాను వేయించుకోవాలని,తద్వారా రోగ నిరోధక శక్తి పెంపొంది మంచి ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు,టీకా వేయించుకున్న వారిలో డాక్టర్ ఎ.నాగరాజు,డాక్టర్ బాసంతి,డాక్టర్ ఝాన్సీ,డాక్టర్ ప్రవీణ్ ఉన్నారు,ఈ కార్యక్రమంలో యు.పి హెచ్సి వైద్యాధికారిణి నిస్సి షారోన్, కోవిడ్-19 అర్బన్ ఇంచార్జ్ పొన్నెకంటి సంజీవరాజు,స్టాఫ్ నర్సులు జయంతి,లలిత, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: