మన్యం టీవీ, అశ్వాపురం:గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి చెతులమీదుగా ఉత్తమ సర్పంచ్ గా అవార్డ్ తీసుకున్న మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ని ఈ రోజు ఎంపీపీ ముత్తినేని సుజాత మొండికుంట పంచాయితీ కార్యాలయంలో శాలువాతో సన్మానించారు,అలాగే ఉపసర్పంచ్ మేడ వరపు సుదీర్,సెక్రెటరి నీలిమారెడ్డి ని సన్మానించారు. ఈ సందర్భంగా పంచాయితీకి మల్లారెడ్డి చేసే సేవలను అభినందించారు ఇలాంటి మరిన్ని సేవలను అందించి మొండికుంట పంచాయితీని ఇంకా అభివృద్ది చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కమటం నరేష్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె ఖదీర్,తెరాస మండల నాయకులు జాలె రామక్రిష్ణా రెడ్డి,యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: