గుండాల మన్యం టీవీ: అధికారులు ఆళ్లపల్లి మండలం ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా కనీసం అభివృద్ధి పనుల పురోగతిపై మూడు నెలలకోసారి నిర్వహిస్తున్న సమావేశానికి గైర్హాజరు అవుతున్నారని ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, జడ్పిటిసి కొమరం హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మంగమ్మ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 22 శాఖల గాను 12 శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. వచ్చిన అధికారులు కూడా తమ శాఖల జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతి నివేదికలు ఇవ్వకపోవడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేసే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో మంగమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎల్లయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: