CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వారణాసిలో పర్యటించిన‌ సీఎం కేసీఆర్ సతీమణి ‌శోభ, ఎమ్మెల్సీ ‌‌కల్వకుంట్ల‌ కవిత

Share it:

 



ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ,  సీఎం కేసీఆర్  సతీమణి‌,  శ్రీమతి శోభ , కుటుంబ సభ్యులు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో పర్యటించారు. పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గంగా హారతి నిర్వహించారు.


గురువారం ఉదయం ఎమ్మెల్సీ కవిత,  శోభ గారు మరియు  కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. వారణాసిలో ముందుగా అస్సి ఘాట్ కు చేరుకున్నారు. అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్ లో ప్రయాణిస్తూ, బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు. దశాశ్వమేధ ఘాట్ లో గంగా నదికి హారతి ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత, గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో సంభాషించారు. దశాశ్వమేధ ఘాట్ లో పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం బోట్ లో‌ అస్సీ ఘాట్ కు బోట్ లో‌ తిరుగు ప్రయాణమయ్యారు. 


సాయంత్రం ప్రాచీన సంకట‌్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ఎమ్మెల్సీ ‌కవిత.

Share it:

TELANGANA

Post A Comment: