కొమరం భీమ్ విగ్రహానికి భూమి పూజా చెసిన ప్రభుత్వ విప్ రేగా
మన్యం టీవీ: కరకగూడెం.తుడుందెబ్బ ఆద్వర్యంలో మండలపరిదిలోని వీరపూరం క్రాస్ రోడ్డు వద్ద కొమరం భీమ్ విగ్రహం నిలుపుట కోసం భూమి పూజా నిర్వహించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. అనంతరం అయన మాట్లాడుతూ జల్ జంగిల్ జమీన్ ప్రదాత కొమరం భీమ్ అని కొనియాడారు. ఆదివాసీ హక్కుల కోసం నిజాం నిరంకుశంపై తుడుం మోగించారని నేటి యువతరం కొమరం భీమ్ ఆశయ సాధన కోసం యవాత్ జాతి ఐక్యంగా హక్కుల కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.తుడుందెబ్బ ఆద్వర్యంలో కొమరం భీమ్ విగ్రహ నిర్మాణం కోసం పని చేస్తున్న సంఘం నాయకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విగ్రహ నిర్మాణం కోసం నావంతుగా పూర్తి సహాయ సహకారాలు జాతికి ఎల్లప్పుడూ వుంటుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోలెం నాగేశ్వరరావు స్థానిక ఎంపీపీ రేగా కాళిక పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు వట్టం నారాయణ గొల్లగూడెం సర్పంచ్ ఇర్ప విజయ్ కుమార్ చిరుమళ్ళ సర్పంచ్ పాయం నరసింహరావు అనంతరం సర్పంచ్ బత్తిని నరసింహరావు తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి నాయకులు సూతరి నాగేశ్వరరావు కొమరం రాంగోపాల్ మడకం సత్యలింగం కొమరం పంతులు తొలెం హరి క్రిష్ణ కొమరం సంగీత్ టిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య మల్కం వెంకటేశ్వర్లు రావుల రవి పాల్గొన్నారు.
Post A Comment: