మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మణుగూరు లోని డ్రైనేజీ కాలువలు,నూతన బ్రిడ్జి నిర్మాణ పనులను మున్సిపాలిటీ అధికారులతో కలిసి పరిశీలించారు.పనుల పై అధికారులకు పలు సూచనలు చేశారు పనులను వేగంగా పూర్తి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, మూసిపాలిటి కమిషనర్ వెంకటస్వామి,పిఏసిఎస్ ఛైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీ కణితి బాబురావు, మండల, టౌన్ అధ్యక్షులు ముత్యం బాబు,అడపా అప్పారావు, అడపా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు సాగర్ యాదవ్, టౌన్ యువజన నాయకులు రుద్ర వెంకట్,టిఆర్ఎస్ నాయకులు ముద్దంగుల కృష్ణ, బొశెట్టి రవి,రామకోటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: