CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామ్స్ మెమోరియల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నమెంట్ను ప్రారంభించిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

Share it:

  


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండలం,ఎర్రగుంట గ్రామంలో(పెద్దిరెడ్డిగూడెం)నేటి నుంచి ప్రారంభం కానున్న,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాల స్థాయి షెటిల్ టోర్నమెంట్ కార్యక్రమంకు కోరం కనకయ్య విచ్చేశారు.ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్(ఏటిఎఫ్)తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అగ్గి రవి సోదరుడు అగ్గి రాము జ్ఞాపకార్థం నిర్వహించనున్న,ఈ టోర్నమెంట్ కార్యక్రమంను ప్రారంభోత్సవం చేసి,క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.క్రీడల పట్ల యువత ఆసక్తి చూపాలని, క్రీడల్లో పాల్గొనడం వలన మానసిక ఉల్లాసాన్ని,మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అని తెలియజేశారు.మూడు రోజులపాటు జరగనున్న ఈ షటిల్ టోర్నమెంట్లో,రెండు జిల్లాల నుండి 80 జట్లు పాల్గొంటున్నాయి అని కమిటీ వారు తెలియజేశారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ అగ్గి కవిత,అగ్గి సుజాత,ఎంపీటీసీ కాకా సీత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, ములకలపల్లి మండలం సీతయ్య గూడెం సర్పంచ్ కారం సుధీర్, రామచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్,తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు దారబోయిన రమేష్, టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డి పల్లి మండల నాయకులు ఎం రామారావు,కొత్తూరు వెంకటేశ్వరరావు,ఎన్ లాలయ్య,తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: