👉విప్ రేగా కాంతారావు కి మొర పెట్టుకున్న పేటన్నగూడెం పొడుసాగుదారులు.
మన్యం టీవీ, పినపాక:సారు.. మాకు న్యాయం చెయ్యండి...మా తాత, ముత్తాతలు గిరిజన, గిరిజనేతరులు కలిసి పోడు నరికారు. ఏళ్ళ నుండి సాగు చేసుకుంటున్నాం.కొంతమంది దౌర్జన్యం గా తమ భూములను లాకున్నారని విప్ ,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావుకు మణుగూరు క్యాంప్ కార్యాలయంలో పేటన్నగూడెం పోడు సాగు దారులు మొర పెట్టుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి. భద్రద్రి కొత్తగూడెం పినపాక మండలం సీతరంపురం పంచాయతీ పెంటన్నగూడెం గూడెం కు చెందిన నిరుపేద దళితులు,గిరిజనులు పోడు నరుకున్నారు.ఐతే బొమ్మరాజుపెళ్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం గా తమ భూములు లాకున్నారని పేటన్నగూడెం కి చెందిన సుమారు 50 దళిత,గిరిజనకుటుంబాలు విప్ రేగా కాంతారావు కి మొర పెట్టుకున్నారు. తమకి న్యాయం చేయాలని వేడుకుకున్నారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీశ్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము,పెంటన్నగూడెం పొడుసాగుదారులు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: