మన్యం టీవి,పినపాక:
మండల పరిధిలోని ఈ బయ్యారం లో గల వివేకానంద కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో
స్వామి వివేకానంద 158వ జయంతిని ఘ నం గా జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఎడ్యుకేషనల్ డైరెక్టర్ శ్రీరామ్ బృహస్పతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ స్వా మి వివేకానందను ఆద ర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అన్నారు.ప్రపంచానికి స్పూర్తి నిచ్చిన ఆధ్యాత్మికవేత్త అని,హిందుత్వం గురిం చి ప్రపంచానికి చాటిచెప్పిన ముఖ్యవ్యక్తి స్వామి వివేకానంద అని అ న్నారు.
యువత ఆదర్శంగా ఉన్నట్లైతే దేశం అభివృద్ది చెందుతుందని ఆ దిశలో స్వామి వివేకానంద ఆదర్శంగా నిలిచారని అన్నారు. స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళు లర్పి ంచారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. హందూ మత సాంప్ర దాయాలను ప్రపంచంలోనే చాటి చెప్పిన మహానీయుడని పలువురు కొని యాడారు. యువకులు దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలని, నిరుత్సాహం, నిస్ప్రుహ, ఉన్నట్లైతే ఆ వ్యక్తులు ఎందుకు కొరగారని అన్నారు. ఈ కార్యక్ర మంలో శ్రీరామ్ శ్రీనివాసరావు, శ్రీరామ్ లత, నివేద న్ , సాంబయ్య, వెంకటేశ్వర్లు, భద్రయ్య, రామకృష్ణ,శివ ప్రసాద్ అదితరులు పాల్గొన్నారు.
Post A Comment: