CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అశ్వరావుపేట మండల వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు.

Share it:

 



 మన్యంటీవీ,అశ్వరావుపేట:

వామపక్షాలు, విపక్షాలు, రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో  నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు పంచాయతీ సర్పంచ్ ల కు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వరావుపేట పంచాయతీ సర్పంచ్ కు

సిపిఐ జిల్లా నాయకులు సయ్యద్ సలీం, సయ్యద్ రఫీ, సిపిఎం జిల్లా నాయకులు కె పుల్లయ్య, చిరంజీవి నాయుడు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు  ప్రభాకర్, కాంగ్రెస్ ,తెలుగుదేశం నాయకులు అంతా కలిసి అశ్వరావుపేట గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అశ్వరావుపేట మండలం లోని మల్లయ్ గూడెంలో 

సిపిఐ, సిపిఎం నాయకులు, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ  మల్లయ్ గూడెం  గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు,కార్యకర్తలు, కోయ రంగాపురం గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీపీఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఆసుపాక గ్రామ సర్పంచ్ కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అశ్వరావుపేట మండల వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: