మన్యం టీవీ, అశ్వరావుపేట: ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందటే చాలు కోడి పందాలు నిర్వహించడం, పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో పందాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసకునున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సంక్రాంతికి ముందు నుంచే కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు.
వీటిన్నింటినీ చెక్ పెట్టేందుకు న్యాయస్థానం గత సంవత్సరం లో ఆదేశాలను జారీ చేసింది. దీంతో అప్పటినుండి కోడిపందేలు నిర్వహించే వారిని, జూదం ఆడే వారిని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కోణంలో కోడి పందాలు, పేకాట ఆడకూడదని పోలీసులు తెలుపుతున్నారు. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగ ముందురోజు హడావుడిగా బరి ప్రాంతాలను శుభ్రం చేసి చదునుచేసి టెంట్లు ఏర్పాటు చేసి పందేలను నిర్వహించే వారు. కానీ ప్రస్తుత కాలంలో పోలీసులు, ప్రభుత్వాలు ఈ పందాలను రద్దు చేయడంతో పందేలు నిర్వహణ తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన అశ్వారావుపేట దమ్మపేట మండల పరిధిలోని ఎక్కడైనా పేకాట, కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు సీఐ ఉపేంద్ర దృష్టికి వస్తే కనికరం లేకుండా కటకటాల్లోకి పంపిస్తానని హెచ్చరించారు, ఈ యొక్క సంక్రాంతి పండుగను తమ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని సూచించారు.
Post A Comment: