మన్యం టీవీ,అశ్వాపురం : ఈరోజు అశ్వాపురం మండల కేంద్రంలో రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు సాధన కు పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఉదయం అశ్వాపురం ట్రాలీ ఆటో అడ్డా వద్ద కిలారి తిరుపతి రావు అధ్యక్షతన జరిగిన యూనియన్ ప్రధమ మహాసభ లో అయన ప్రసంగిస్తూ ఇన్సూరెన్స్ ప్రీమియం లో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సరుకు రవాణా వాహనాలకు టోల్ల్గాటే పీజు రద్దు చెయ్యాలని అయన డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులు గా కిలారి తిరుపతి రావు, గౌరవ సలహాదారుగా వాసుదేవ చారీ, అధ్యక్షులు గా యెక్కటి పున్నారెడ్డి, కార్యనిర్వాక అధ్యక్షులు గా రాగి సాగర్, ఉపాధ్యక్షులు గా రెడ్డి రాజుల హరీష్, ప్రధాన కార్యదర్శి గా గంట క్రాంతి కిరణ్ రెడ్డి, సహాయ కార్యదర్శులు గా గరటి రాంబాబు, ఆకుల సురేష్, కోశాధికారి గా కరెడ్ల సూర్య ప్రకాష్, లను ఎన్నుకున్నారు.
Post A Comment: